హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ చాంపియన్షిప్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. చెన్నై వేదికగా జరిగిన టోర్నీ బాలికల విభాగంలో అమూల్య విజేతగా నిలువగా.. అనూష రన్నరప్ ట్రోఫీ చేజిక్కించుకుంది.
అఖిల, ప్రిసిల్లా మూడో స్థానాలు దక్కించుకోగా.. బాలుర విభాగంలో ముకుల్ థర్డ్ ప్లేస్లో నిలిచాడు. జాతీయ స్థాయిలో రాణించిన యువ గోల్ఫర్లను గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందించారు.