అమరావతి : విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో అమెరికా కార్నర్ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో అమెరికా కాన్సులేట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.
దక్షిణ భారతదేశంలో అమెరికా కార్నర్ తొలిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం విశేషం. సదస్సుకు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్, ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు మంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ కార్నర్ ద్వారా విద్యార్థులకు అమెరికా విద్యపై, ఉన్నత విద్యపై సదస్సులు, వర్క్షాపులను నిర్వహించనున్నారు.
అమెరికా నుంచి నిధులు వచ్చే సౌలభ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అమెరికా కార్నర్ ప్రారంభం కావడం సంతోషదాయకమన్నారు.
ఈ కార్నర్ అమెరికా విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.అమెరికా కార్నర్ ఆంధ్రావర్సిటీకే తలమానికం కానుందని ఏయూ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రసాద్రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చందర్, సీఎం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కే హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్యా కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, అమెరికా పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయెర్, రీజినల్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్ట్ న్యూఢిల్లీ మార్క్ బుర్రెల్ పాల్గొన్నారు.