ఒకవైపు కరోనాతో ప్రజలు వణికిపోతుంటే ఇప్పుడు తౌటే తుఫాను వారిని మరింతగా కుంగదీసింది. తౌటే అతి తీవ్ర తుఫానుగా మారగా.. భారీగా గాలులు వీశాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే తౌటే తుఫాను ఎఫెక్ట్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు తాకింది. అతని జనక్ కార్యాలయం వరదలలో మునిగింది. ఈ విషయం అమితాబ్ తన బ్లాగ్లో రాసుకొచ్చారు.
నిశ్శబ్ధంగా ఉన్న తుఫాను విరుచుకు పడింది. రోజంతా వర్షం పడింది. చెట్లు పడిపోయాయి. సిబ్బంది కోసం నిర్మించిన షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి. ప్లాస్టిక్ కవర్ షీట్లు గాలుల వల్ల ఎగిరిపోయాయి.. కొంతమంది సిబ్బంది తడచిపోయారు. నా సిబ్బంది తడిచినప్పటికీ వారు మరమత్తులు చేస్తూనే ఉన్నారు. వారికి నా వార్డ్ రోబ్ నుండి దుస్తులు ఇచ్చాను అంటూ 78 ఏళ్ల అమితాబ్ తన బ్లాగ్లో రాసుకొచ్చారు.