న్యూఢిల్లీ : రేపటి నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న క్రమంలో ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా డోసులు మే 1న భారత్ కు చేరుకోనున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ల కొరత వెంటాడుతున్న క్రమంలో స్పుత్నిక్ వీ టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి.
భారత్ లో ఇప్పటికే కొవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుందని భావిస్తున్నారు.