చెన్నై: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో తమిళనాడులో లాక్డౌన్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి విస్తృతిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అందరూ మాస్కులు ధరించేలా, సామాజిక దూరం, శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలకు తన ఆదేశాల్లో సూచనలు చేసింది. కాగా, గత 24 గంటల్లో తమిళనాడులో 486 మంది కరోనా వైరస్ బారినపడగా, ఐదుగురు మృతిచెందారని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.