న్యూయార్క్ : తన వద్దకు వచ్చే పేషెంట్లను లైంగికంగా వేధింపులకు గురిచేసిన కేసులో రూ.8 వేల కోట్ల పరిహారం ఇవ్వాలని అమెరికాకు చెందిన ఓ కోర్టు తీర్పునిచ్చింది. గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న ఓ డాక్టర్ వేధింపుల పర్వం తొలిసారి 2016 లో వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి విచారణ జరుగుతున్నది.
సదరు డాక్టర్పై దాదాపు 500 మంది మహిళలు ఫిర్యాదు చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ పరిహారం మొత్తాన్ని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా చెల్లించనున్నది. మూడు వేర్వేరు కేసులలో ఈ పరిహారాన్ని కోర్టు ఆదేశించింది.
విశ్వవిద్యాలయంలో పనిచేసే గైనకాలజిస్ట్ డాక్టర్ జార్జ్ టిండాల్.. తన వద్దకు వచ్చే రోగులను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం దీనిని ఒక చీకటి అధ్యాయంగా భావించి, నిందితుడు డాక్టర్ జార్జ్ టిండాల్పై చర్య తీసుకుని ముగింపు కూడా ఇచ్చింది.
2016లో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో 500 మంది మహిళలు తమపై లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. 500 మంది మహిళలు విశ్వవిద్యాలయంపై కేసు నమోదు చేశారు. హాట్లైన్, వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేయాలని విశ్వవిద్యాలయ విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం 3.5 లక్షల మంది విద్యార్థులకు మెయిల్ పంపారు.
మొదటి ఫిర్యాదు 2016 లో ఒక విద్యార్థి నమోదు చేశారు. ‘తనను డాక్టర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి మొదలైన ఫిర్యాదుల పర్వం 2018 వరకు కొనసాగింది. చివరకు డాక్టర్ జార్జ్ టిండాల్ చేసిన తప్పుడు పనులను కోర్టు నిర్ధారించింది. బాధితులకు 1.1 బిలియన్ డాలర్ల పరిహారం అందించాలని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధికారులకు ఆదేశించింది.
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..