వాషింగ్టన్ : తైవాన్పై అమెరికా, చైనా మధ్య వివాదం నడుస్తుండగా.. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం చైనాకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. తైవాన్ యథాతథ స్థితిని మార్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
“తైవాన్కు సంబంధించి బీజింగ్ ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలే మనం చూసినవి. మాకు నిజమైన ఆందోళన కలిగించేవి. మేం తైవాన్కు కట్టుబడి ఉన్నాం” అని బ్లింకెన్ తెలిపారు. గత నెల ప్రారంభంలో, అలాస్కాలో జరిగిన యూఎస్-చైనా సమావేశానికి ముందు, 20 మంది ప్రభావవంతమైన శాసనసభ్యుల బృందం అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో సమావేశమయ్యారు. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్కు మద్దతు ఇవ్వమని భారతదేశంతో పాటు ఇతర పొరుగువారికి అభ్యర్థించారు. చైనా దూకుడు ప్రవర్తన సమస్యను లేవనెత్తాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో తైవన్పై చైనా ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరికలు జారీ చేస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలన్నారు. తైవాన్కు అమెరికా మద్దతుగా నిలువడంతో ఇప్పుడు చైనా ఎలా వ్యవహరిస్తుంది అనేది రాజకీయ పరిశీలకులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ చర్యలపై సంతృప్తిగా లేం : గుజరాత్ హైకోర్టు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
సెనేట్లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్.. చరిత్రలో ఈరోజు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..