లక్నో: ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకుని వస్తున్న ఆరుగురు ఆ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం చాలా భీకరంగా జరిగినట్లు భావిస్తున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా రావడం వల్ల ఆ రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు సీఎం యోగి సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడ్డవారికి చికిత్సను అందించాలని సూచించారు.