బూర్గంపహాడ్, జూన్ 7: లారీని అంబులెన్స్ ఢీకొనడంతో అందులోని రోగి మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన పాయల ధనిబాబు (34)కు గుండెపోటు రావడంతో చర్లలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్సచేసి ఖమ్మంకు వెళ్లమని సూచించారు. దీంతో ధనిబాబును అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్తుండగా లక్ష్మీపురం శివారులో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ధనిబాబు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.