భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో పాటు సరిపడా మెడికల్ ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది కరోనా బాధితులు మరణిస్తున్నారు.
పెరుగుతున్న కొవిడ్-19 కేసుల కారణంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ప్రైమ్ డే సేల్ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందించే యాన్యువల్ ఈవెంట్ ద్వారా సేల్స్ పెంచుకోవడానికి, కొత్త ప్రైమ్ సబ్స్క్రైబర్ల ను ఆకర్షించడానికి ప్రతిఏటా దీన్ని నిర్వహిస్తుంటుంది. రెండు రోజుల పాటు నిర్వహించే సేల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్, తదితర వస్తువులపై ప్రైమ్ సభ్యులకు డిస్కౌంట్లు అందిస్తుంది.
భారత్లో కరోనాపై పోరులో సహకారం అందించేందుకు అమెజాన్, గూగుల్ సహా టెక్ కంపెనీలు వైద్య పరికరాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్స్తో పాటు ఔషధాలను అందిస్తున్నాయి. కరోనా వల్ల గతేడాది భారత్లో ఆగస్ట్ నెలలో సేల్ జరిగింది.