న్యూఢిల్లీ : ఆగస్ట్ 10 వరకూ కొనసాగే అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్లో 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్టీవీలపై భారీ తగ్గింపును ఈకామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. పలు ఉత్పత్తులపై అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ కార్డులపై ఇన్స్టంట్ డిస్కౌంట్లను ఆఫర్ చేయడంతో కొనుగోలుదారులకు హాట్ డీల్స్ లభిస్తున్నాయి.
ఈ సేల్లో 11 జెన్ కోర్ ఐ3 ప్రాసెసర్, హెచ్డీ వెబ్కాం, డాల్బీ ఆడియోను సపోర్ట్ చేసే స్పీకర్లు కలిగిన లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 రూ 34,990కు అందుబాటులో ఉంది. ఎంఐ నోట్బుక్ అల్ట్రా ల్యాప్టాప్ అమెజాన్ సేల్లో రూ 52,990కి లభిస్తోంది. ఇది 11జెన్ కోర్ ఐ5 ప్రాసెసర్ను కలిఇఉంది.
ఇక అమెజన్ గ్రేడ్ ఫ్రీడం ఫెస్టివల్లో సోనీ బ్రేవియా 55 ఇంచ్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ డిస్కౌంట్ ధరలో రూ 68,390కి అందుబాటులో ఉంది. ఇక 55 ఇంచ్ టీసీఎల్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ 38,999కి లభిస్తోంది. ఇంకా వన్ప్లస్ టీవీ, సోనీ 43 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ డిస్కౌంట్ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది.