అమరావతి : అమరావతి రాజధాని రైతులు చేపట్టిన అమరావతి- అరసవల్లి మహాపాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు దేవినేని మ, రావి వెంకటేశ్వరరావు, అఖిలపక్ష ఐక్య కార్యచరణ సమితి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అభివృద్ధి చెందుతున్న అమరావతిలో పరిశ్రమలు నెలకొల్పితే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఒకే ఒక రాజధాని అమరావతినే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు దేవుడే తగిన బుద్ధి చెబుతాడని యాత్రలో పాల్గొన్న మహిళలు అన్నారు. జగన్ అమరావతిని రాజధానిగా ఉంచుతూ అభివృద్ధి చేస్తే మరోసారి గెలిపించుకుంటామని అన్నారు. ఈ యాత్ర మధ్యాహ్నానికి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.