స్టార్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన ఘన విజయం తెలిసిందే. బాలీవుడ్ సహా దక్షిణాది అంతా భారీ వసూళ్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ విజయంతోనే ఈ సినిమా చరిత్ర ఆగిపోలేదు. తాజాగా మ్యాజిక్ ఆల్బమ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్ బిడ్డా..ఇలా సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 5 బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 500 కోట్ల వ్యూస్ దక్కించుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ ముందునుంచీ మ్యూజికల్ హిట్టే. ‘పుష్ప’ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. చంద్రబోస్ సాహిత్యం, దేవి అందించిన స్వరాలు మార్మోగాయి. మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలోనే ‘పుష్ప 2’ సెట్స్ మీదకు వెళ్లనుంది.