తెలుగుతోపాటు హిందీ బెల్ట్లో కూడా ‘పుష్ప’ రికార్డులు సృష్టించి భారీ హిట్ సొంతం చేసుకుంది. దీంతో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పుష్ప తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ సంస్థ నుంచి ‘2.0’, ‘కత్తి’, ‘దర్బార్’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్కు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా ప్రొడెక్షన్ ఆఫర్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
‘పుష్ప’ హిట్తోనే బన్నీ రేంజ్ ఈ స్థాయిలో పెరిగిందని ఫిలింనగర్ టాక్. అయితే అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో ఒక చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్గా అనుకున్నారు. కానీ అప్పట్లో ఆమె ఈ చిత్రానికి నో చెప్పిందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు.