కరోనా వలన అవార్డుల వేడుకలనేవి జరగక చాలా రోజులు అయింది. గత రాత్రి హైదరాబాద్లో ఓ ప్రముఖ పత్రిక 6 వ, 7 వ ఎడిషన్కి సంబంధించిన అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టగా ఈ వేడుకలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో చిత్రానికి ఏకంగా ఐదు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు దక్కాయి.
అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ అందుకున్రారు. థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించాడు. తమ చిత్రానికి ఇన్ని అవార్డ్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తి బన్నీ ఈవెంట్లోదిగిన ఫొటోని షేర్ చేస్తూ…అల సాక్షి అవార్డ్స్ లో కామెంట్ చేశాడు. ఇక మహేష్ బాబు కూడా మహర్షి చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు.