హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సానుకూల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జర్నలిస్టు సం ఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని జస్టిస్ రమణను ఆయన నివాసంలో శనివారం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తోపాటు పలువురు నాయకులు కలిశారు. జస్టిస్ రమణను శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ అనేక విషయాలను అడిగి తెలుసుకొన్నారు. ‘కొలిమి అంటుకున్నది’ పుస్తకం గురిం చి అల్లం నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడారు. జస్టిస్ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపినవారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి నరేందర్రెడ్డి, ఢిల్లీ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఉన్నారు.