హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు జారీచేసిన హెల్త్కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కోరారు. మంత్రి హరీశ్రావును గురువారం అరణ్యభవన్లో కలిసి, హెల్త్కార్డుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలో వైద్యశాఖ ఉన్నతాధికారులు, మీడియా అకాడమీ చైర్మన్, జర్నలిస్టు ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిషరిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సమస్య పరిషారానికి కృషి చేసిన మంత్రి హరీశ్రావుకు అల్లం నారాయణ, క్రాంతికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే నాయకులు సూరజ్ భరద్వాజ్, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.