ఎస్సారెస్పీలో 76 టీఎంసీల నిల్వ
మత్తళ్లు పోస్తున్న 8 వేల చెరువులు
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు వరద కొనసాగుతూనే ఉన్నది. సింగూరు ప్రాజెక్టు జలకళను సం తరించుకుంది. లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్లకు సైతం వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుం గభద్ర, కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఆల్మట్టికి ఆదివారం 75 వేల క్యూసెక్కుల వరద రాగా, సోమవారం సాయం త్రం నాటికి 82 వేల క్యూసెక్కులకు పెరిగింది.
మత్తళ్లు దుంకుతున్న 8 వేల చెరువులు
రాష్ట్రవ్యాప్తంగా 8,107 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. 8,641 చెరువులు పూర్తిస్థాయి నీటి నిల్వమట్టానికి చేరుకున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మం చిర్యాల, పెద్దపల్లి జిల్లాలో చెరువులన్నీ నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) 81 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.