హైదరాబాద్: శాసనమండలి (Legislative council) చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమయింది. వీరి ఎన్నికకు సంబంధించిన ప్రకటన నేడు వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. దీంతో రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
గతేడాది జూన్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ల ఎమ్మెల్సీ సభ్యత్వ కాలం నేటితో ముగిసింది. దీంతో ప్రోటెం చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలిలోని ఖాళీలన్నీ భర్తీకావడంతో తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రకట వెలువడనున్నది.