ఒడిశాలోని పూరీలో సోమవారం జరగనున్న జగన్నాథుడి రథయాత్ర కోసం సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. కాగా కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే పూరీ జగన్నాథ రథయాత్ర సాగనుంది. పూరీ రథాన్ని లాగేందుకు మూడు వేల మంది సేవకులను అనుమతించాలని నిర్ణయించారు. వీరితో పాటు వెయ్యి మంది ఆలయ ఉద్యోగులు, పోలీసులు ఈ రథయాత్రలో పాల్గొనన్నున్నారు. రథయాత్రలో పాల్గొనే వారందరూ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని.. అలాగే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని ఆలయ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?