న్యూఢిల్లీ : దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్ర అండ్ మహింద్ర రూ 10.35 లక్షల ప్రారంభ ధరతో న్యూ ఎక్స్యూవీ300 టర్బోస్పోర్ట్ను లాంఛ్ చేసింది. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సన్, హ్యుందయ్ వెన్యూ వంటి ఎస్యూవీలకు న్యూ మహింద్ర ఎక్స్యూవీ300 టర్బోస్పోర్ట్ దీటైన పోటీ ఇవ్వనుంది.
న్యూ ఎక్స్యూవీ టెస్ట్ డ్రైవ్లు, బుకింగ్లు, డెలివరీలు అక్టోబర్ 10 నుంచి షురూ కానున్నాయని కంపెనీ తెలిపింది. న్యూ ఎక్స్యూవీ300 టర్బోస్పోర్ట్ కేవలం ఐదు సెకండ్లలోనే జీరో నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ ఎస్యూవీ బ్లేజింగ్ బ్రాంజ్, నపోలి బ్లాక్, పెరల్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ (మోనోటోన్) వంటి నాలుగు కలర్స్లో ఉంటుంది.
రెడ్ గ్రిల్ ఇన్సర్ట్స్, ఆల్ బ్లాక్ ఓఆర్వీఎమ్ల వంటి న్యూ స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. న్యూ మహింద్ర ఎక్స్యూవీ300 టర్బోస్పోర్ట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్తో పాటు ఆటో హెడ్ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ వంటి ఫీచర్లను కలిగిఉంది.