కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కరీంనగర్కు చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి అంజన ప్రతిభను గుర్తించి సాట్స్లో ఉద్యోగమివ్వడమే ఇందుకు నిదర్శమన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆల్ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలను సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే అసోసియేషన్ బాధ్యులు శ్రీనివాస్, హరిశంకర్, రాజిరెడ్డి, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.