ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ గంగూభామ్ కతియావాడి అనే పేరుతో సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. చిత్రంలో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించగా, గంగూభాయ్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఒదిగిపోయింది.
మరి కొద్ది రోజులలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తుండగా, టీంకు ఎదురు దెబ్బ తగిలింది. అలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ కు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ఆలియా, సంజయ్ను మే 21న గానీ అంతకంటే ముందుగానీ కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తన తల్లి ప్రతిష్టను కించపరిచే విధంగా, ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను అగౌరవ పరిచే విధంగా గంగుభాయ్ కతియావాడి చిత్రం ఉందనే ఆరోపణలతో ఆమె కుమారుడు బాబురావు షా ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ను పరిగణనలోకి తీసుకొని కోర్టు సమన్లు జారీ చేసింది.