ఈ కాలం నాటి అందాల భామలు ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, జిమ్కి మాత్రం కొంత సమయం కేటాయిస్తుంటారు. ఈ క్రమంలో జీరో సైజ్లోకి మారుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు 40డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్ని స్వీకరించగా, నేటితో 20 రోజులు పూర్తైంది. ఈ సందర్భంగా తన సన్నని నడుము చూపిస్తూ సెల్ఫీ దిగింది.
అలియా నాజూకు నడుము చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. అలానే బాలీవుడ్ బ్యూటీస్ మలైకా అరోరా, కత్రికా కైఫ్లతో పాటు మనీష్ మల్హోత్రా పలువురు ప్రముఖులు స్టన్నింగ్స్ కామెంట్స్ పెట్టారు. ఇక అలియా భట్ సినిమాల విషయానికి వస్తే ఈ అమ్మడు ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్లో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’లో అలియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరోవైపు బ్రహ్మాస్త్రా అనే ప్రాజెక్ట్లో రణ్భీర్ సింగ్తో కలిసి నటిస్తుంది. కరోనా వలన అలియా నటించిన పలు ప్రాజెక్ట్లు పెండింగ్లో పడ్డాయి.