అలాస్కా: అమెరికాలోని అలస్కా ద్వీపంలో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8.2 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి 10.15 గంటల సమయంలో పెర్రివిల్లెకు తూర్పు-ఆగ్నేయంలో 57 మైళ్ల దూరంలో, భూమికి 29 మైళ్ల లోపతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
ఆ తర్వాత అదే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.5.. 5.6 తీవ్రతతో మరో రెండుస్లారు భూమి కంపించిందని పేర్కొంది. దీంతో జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం దక్షిణ ప్రాంతంతో పాటు, ఫసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ హవాయి, ఇతర అమెరికా, కెనడియన్ ఫసిఫిక్ తీర ప్రాంతాలకూ సునామీ ముప్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అయితే, భూ ప్రకంపనలతో ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.