ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వేడి తొలగించడానికి యోగి ఏమైనా కంప్రెస్సరా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో కూడా యోగి అన్పార్లమెంటరీ పదాలు వాడతారని అఖిలేశ్ ఆరోపించారు. ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరీతో కలిసి అఖిలేశ్ విలేకరులతో మాట్లాడారు. వేడి తొలగిస్తామని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. వేడిని తీసేయడానికి ఆయనేమైనా కంప్రెస్సరా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. సీఎం యోగికి శాంతిపై ప్రేమ లేదని, కేవలం అహింసపైనే ఆయనకు ప్రేమ ఎక్కువ అని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. ఈసారి కచ్చితంగా యోగిని గోరఖ్పూర్ ప్రజలు ఇంటికి పంపిస్తారని అన్నారు. కోవిడ్ విజృంభించిన సమయంలో, దానిని ఎదుర్కోవడంలో యోగి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీని కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అఖిలేశ్ మండిపడ్డారు.