న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. టైమ్స్ 100 వర్ధమాన నాయకుల తాజా జాబితాలో చోటు సాధించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎదుగుతున్న 100 మంది లీడర్లతో ఈ లిస్టు తయారవగా, ఇందులో స్థానం పొందిన ఏకైక భారతీయుడు ఆకాశ్ అంబానీయే కావడం గమనార్హం. అయితే ఈ జాబితాలో భారత సంతతికి చెందిన మరొకరూ ఉన్నారు. ఆమెనే ఓన్లీఫ్యాన్స్ సీఈవో 32 ఏండ్ల ఆమ్రపాలి గన్.