న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిన అకాలీదళ్.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 1996 లోక్సభ ఎన్నికల అనంతరం దాదాపు 27 సంవత్సరాల తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అకాలీదళ్, బీఎస్పీ చేతులు కలిపాయి. పంజాబ్లోని 13 స్థానాల్లో 11 స్థానాలను దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడు సీటుల, అకాలీదళ్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీకి గణనీయమైన పట్టుంది. పంజాబ్ జనాభాలో దళితులు 40 శాతం మంది ఉన్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కేటాయించిన సీట్లనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలుండగా.. 90కిపైగా స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేయగా.. మిగతా సీట్లలో బీజేపీ పోటీ చేసింది. అలాగే లోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో పదింట్లో అకాలీదళ్, మిగతా మూడు చోట్ల బీజేపీ పోటీకి దిగాయి. గత ఏడాది సెప్టెంబర్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలగించడంతో పాటు.. మంత్రి పదవి నుంచి హర్సిమ్రత్ కౌర్ వైదొలిగారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77, అకాలీదళ్ 18 చోట్ల విజయం సాధించాయి.