న్యూఢిల్లీ : అక్టోబరు 9న హాకీ ఇండియాకు నిర్వహించనున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎలక్టొరల్ అధికారి అజయ్ నాయక్ను నియమించారు. ఆయన సహాయకునిగా ఎకె మజుందార్ను ఎంపిక చేశారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య, హాకీ వ్యవహారాలు చూస్తున్న కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మధ్య సోమవారం జరిగిన సమావేవంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 13నుంచి 29వరకు భువనేశ్వర్లో హాకీ ప్రపంచకప్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకున్నది.