అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న మోస్తారు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగు తోంది. మంగళవారం డ్యాం లోకి ఇన్ఫ్లో 10,840 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,593 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తు తం 100.086 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడు గుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.80 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు తగ్గుతున్న వరద ..
కర్ణాటకలోని ఎగువన ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద తగ్గుతోంది. మంగళవారం ఆర్డీ ఎస్ ఆనకట్టకు 7,952 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా,7,500 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.9 అడు గుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 452 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తు న్నట్లు ఆయన తెలిపారు.