ఢిల్లీ,జూలై 2: దేశంలోని టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. “ఎయిర్టెల్ బ్లాక్”పేరుతో నూతన ప్లాన్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకే ప్లాన్ లో ఫైబర్, డీటీహెచ్,మొబైల్ కు సంబంధించిన సేవలు అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. భారతదేశంలో గృహాల కోసం మొట్టమొదటిసారిగా లభ్యమవుతున్న ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ గా “ఎయిర్టెల్ బ్లాక్” నిలవనున్నది.
హై స్పీడ్ డాటా అవసరాలు పెరగడమే కాకుండా,ఇంటి వద్దనే మెరుగైన వినోదం, సౌకర్యవంతమైన మొబైల్ కనెక్టివిటీ వంటివి సమగ్రమైన అవసరాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు వేర్వేరు బిల్లులను నెలలో పలు మార్లు చెల్లించాల్సి రావడం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఎప్పుడైనా బిల్లు చెల్లించడం మర్చిపోతే సేవలు నిలిచిపోతున్నాయి. వినియోగదారుల ఈ సమస్యలను పరిష్కరించడానికి ఫైబర్,డీటీహెచ్,మొబైల్ సేవలు మూడూ కలిపి అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది.
‘‘ఎయిర్టెల్ వద్ద మా వినియోగదారుల సమస్యలకు తగిన పరిష్కారాలను అందించే దిశగా మేము వేసిన మరో ముందడుగు ఎయిర్టెల్ బ్లాక్. సౌకర్యం,మనశ్శాంతిని కోరుకుంటున్న మా వినియోగదారుల అవసరాలను ఇది తీరుస్తుందని భారతీ ఎయిర్టెల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ షస్వత్ శర్మ తెలిపారు.
ఎయిర్టెల్ బ్లాక్ను ఎలా పొందాలంటే..?
-ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ పొందవచ్చు.
-మీకు కావాల్సిన సేవలను బట్టి సొంత ప్లాన్ రూపొందించుకోవచ్చు.మీకు దగ్గరలోని ఎయిర్టెల్ స్టోర్ సందర్శిస్తే ఎయిర్టెల్ బ్లాక్ సేవలు పొందొచ్చు.
లేదంటే 88266 55555కు మిస్డ్కాల్ ఇవ్వండి. ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్లు మీరుఎయిర్టెల్ బ్లాక్కు అప్గ్రేడ్ అయ్యేందుకు సహాయపడతారు.
-మరింత సమాచారం కోసం https://www.airtel.in/airtel-black చూడొచ్చు.