హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుఫాన్ వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దీని ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉం టుందని పేర్కొన్నది 28 వరకు రాష్ట్రం లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవచ్చని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.