న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన విమానం.. అమృత్సర్ నుంచి దుబాయ్కు ఒకే ఒక ప్యాసింజర్తో వెళ్లింది. ఆ విమానంలో పారిశ్రామికవేత్త ఎస్పీ సింగ్ ఒబ్రాయ్ ప్రయాణించారు. ఎకానమీ క్లాస్ టికెట్తో ఆయన ఒక్కరే ఆ విమానంలో వెళ్లారు. ఒబ్రాయ్కు గోల్డెన్ వీసా ఉంది. దాని కాలపరిమితి పదేళ్లు. యూఏఈ రెసిడెంట్ ఆయన. అమృత్సర్లో బుధవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఆ విమానం బయలుదేరినట్ల అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆయన .. ఆ విమాన సిబ్బందితో ఫోటోలు దిగారు. అయితే గడిచిన కొన్ని వారాల్లో.. దుబాయ్కు వెళ్తున్న విమానంలో ఒకే ఒక ప్యాసింజెర్ ఉండడం ఇది మూడవ సారి. ముంబై నుంచి దుబాయ్కి వెళ్లిన ఎమిరేట్స్ విమానంలో భవేశ్ జవారీ అనే వ్యక్తి ఒక్కరే ప్రయాణించారు. ముంబై నుంచి వెళ్లిన మరో విమానంలో ఓస్వాల్డ్ రోడ్రిగ్స్ అనే వ్యక్తి ప్రయాణించాడు.