న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. ఎకానమీ క్లాస్లో ప్రయాణించే వయోవృద్ధులు, విద్యార్థులకు బేసిక్ ఫేర్పై గతంలో 50 శాతం రాయితీ ప్రకటించింది. అయితే తాజాగా దానికి 25 శాతానికి పరిమితం చేసింది. ఈమేరకు ఎయిర్ ఇండియా వెబ్సైట్లో వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 29, ఆ తర్వాత కొనుగోలు చేసిన టికెట్లపై వర్తిస్తుందని ప్రకటించింది.
కాగా, రాయితీ తగ్గించడాన్ని ఎయిర్ ఇండియా యాజమాన్యం సమర్ధించుకున్నది. డిస్కౌంట్పై 25 శాతం కోత విధించినప్పటికీ ఇతర ప్రైవేటు ఎయిర్ లైన్స్లు అందిస్తున్న దానికి ఇది రెండు రెట్లు అధికంగా ఉందని స్పష్టం చేసింది. మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా టికెట్ ధరలను రేషనలైజ్ చేయాలని నిర్ణయించామని తెలిపింది. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ఈఏడాది జనవరి 27న టాటాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.