న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన విమానాలు తరుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా-హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్లో లోపాలు గుర్తించిన పైలట్లు దాన్ని కరాచీకి మళ్లించిన గంట వ్యధిలోనే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నది.
కాలికట్-దుబాయ్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 737 క్యాబిన్లో కాలిన వాసన రావడంతో దాన్ని ముందుజాగ్రత్తగా ఒమన్లోని మస్కట్కు మళ్లించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఈ రెండు ఘటనలపై విచారణ జరుపుతున్నట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.