మంత్రంలో శబ్దాలుంటాయి. వాటిని జపించడం వల్ల శక్తి పుడుతుంది. ఆ శక్తిని సాధకుడు కాంతిపరివేషంలా దర్శించగలుగుతాడు. ధ్యానానికి ఏకాగ్రత చాలా అవసరం. మనసును నియంత్రించే శక్తి ఉండాలి. మంత్రోచ్చాటనకు ఏకాగ్రతతో పెద్దగా పనిలేదు. మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మనసు పరిపరి విధాలుగా సంచరిస్తూ ఉంటుంది. ఆలోచనలూ కలుగుతుంటాయి. అవి వస్తూపోతూ ఉన్నా.. మంత్రం కొనసాగుతూనే ఉంటుంది. శబ్దానికి ఉన్న శక్తి వల్ల మంత్రం ఫలితాన్ని ఇస్తుంది. అయితే, సాధన తీవ్రమయ్యే కొద్దీ మంత్రోచ్చాటన సమయంలోనూ ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు మరింత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. దైవానుగ్రహం త్వరగా కలుగుతుంది.