ముంబై : దక్షిణాఫ్రికా ఆటగాడు మర్కరమ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తున్నది. ఇవాళ భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 సిరిస్ ఇవాళ ఢిల్లీ వేదిక జరుగుతున్నది. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. టాస్ వేసే సమయంలో ప్రొటిస్ జట్టు కెప్టెన్ టెంబా బావుమా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. మర్కరమ్ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు.
ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ -2022)లో సన్రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్లో మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచ్లు ఆడి.. 381 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఇదిలా ఉండగా.. సీనియర్లకు విశ్రాంతి, గాయాల కారణంగా యువజట్టుతో భారత్ బరిలోకి దిగుతున్నది. టీ20 సిరిస్కు కెప్టెన్గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించింది.
భారత్ జట్టు : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్) హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నోర్జే.