వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏజీహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు సమక్షంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ హబ్ని ప్రారంభించనున్నారు.
వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్ షిప్లని ప్రోత్సహించేందుకు ఈ హబ్ ఎర్పాటు కావడం దేశంలోనే మొదటిసారి అని వర్సిటి ఉపకులపతి డా. ప్రవీణ్రావు తెలిపారు. ఈ అగ్రిహబ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనుందని జగిత్యాల, వరంగల్, వికారాబాద్లోని గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువయ్యేందుకు,వారి ఆలోచనలకు రూపం కల్పించేందుకు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ హబ్ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. సాంకేతికంగా 21స్టార్టఫ్లను గుర్తించిన ఐటీ శాఖ, ఆర్టిఫిషీయల్ ఇంటలీజెన్స్, రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం, తదితర సమాచారం అందుబాటులో ఉంటుంది. శాస్త్రవేత్తలకు గ్రామీణ యువత, మహిళలు, రైతులు , రైతు ఉత్పత్తి దారుల సంఘాలలో అగ్రి బిజినెస్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ హబ్ ఓ గ్రంథాలయంగా ఉపయోగ పడుతుంది.
నూతన టెక్నాలజీ తో నాణ్యత గల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు ,పురుగు మందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ హబ్ ద్వారా ఫాలో అయిన రైతుకు పెట్టుబడులు ఘననీయంగా తగ్గి, పంటలో నాణ్యత పెరుగ నుంది. ఈ పంట నుంచే అధిక దిగుబడులు పెరిగి దేశ రైతాంగం తెలంగాణ వైపు చూసే అవకాశా లున్నాయి. నాబార్డ్ ఈ అగ్రిహబ్ ఏర్పాటులో అండగా నిలిచిందని వీపీ ప్రవీణ్ రావు తెలిపారు.