న్యూఢిల్లీ: కెయిర్న్ ఎనర్జీ ఇంటర్నేషనల్కు వ్యతిరేకంగా హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సోమవారం రాత్రి పిటిషన్ దాఖలు చేసింది. దేశ సార్వభౌమత్వం, పన్ను ఎగవేత నేపథ్యంలో కెయిర్న్కు వ్యతిరేకంగా భారత్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇంతకుముందు రెట్రోస్పెక్టివ్ (వెనుకటి తేదీ నుంచి) పన్ను చెల్లింపుల విషయంలో టెలికం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం ఓటమి పాలైంది. దీంతో వొడాఫోన్ తర్వాత కేంద్రం.. హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రెండోసారి.
వెనుకటి తేదీ (రెట్రోస్పెటివ్) నుంచి పన్ను చెల్లించాలని కెయిర్న్ను భారత్ ఆదేశించింది. కానీ కెయిర్న్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం.. ఆ సంస్థకు 120 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని గతేడాది డిసెంబర్ 21వ తేదీన భారత్ను ఆదేశించింది. భారత ప్రభుత్వానికి కెయిర్న్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది.
ఈ నేపథ్యంలో కెయిర్న్ ఎనర్జీకి వ్యతిరేకంగా డచ్ లోయర్ కోర్టుతోపాటు బ్రిటన్, కెనడా, అమెరికా, ఫ్రాన్స్లలోని ఎనిమిది న్యాయస్థానాల్లో భారత్ న్యాయపోరాటం చేయనున్నది. ఏదేనీ సంస్థపై గానీ పన్ను విధించే సార్వభౌమత్వ హక్కు తమకు ఉందని భారత్ వాదిస్తున్నది.
వివిధ దేశాలతో ద్వైపాకిక్ష పెట్టుబడుల ఒప్పందాల ఆవల తలెత్తే వివాదాలపై ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయించలేరని, ఇది అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం పరిధిలోకి రాదని కేంద్రం పేర్కొంటున్నది. భారత్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు స్థానిక చట్టాలకు లోబడే వ్యవహరించాలని కేంద్రం వాదిస్తున్నది.
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
భారత్లోకి జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు.. ధరెంతంటే!
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!