పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అవి తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్పై కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కుమార్ విశ్వాస్ ఇంటికి పంజాబ్ పోలీసులు వచ్చారు. కుమార్ విశ్వాస్ ఇంటి బయట నిల్చున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే.. పంజాబ్ పోలీసులు తన ఇంటి ముందు నిల్చున్న ఫొటోలను స్వయంగా కుమార్ విశ్వాస్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ‘పొద్దు పొద్దునే పంజాబ్ పోలీసులు మా ఇంటి ముందు నిల్చున్నారు. ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి ఏదో ఒక రోజు నీకు, పంజాబ్ ప్రజలకు తీరని ద్రోహం చేస్తారు. ఈ మాటలను అందరూ గుర్తుంచుకుంటారు’ అంటూ సీఎం భగవంత్ మాన్ను కుమార్ విశ్వాస్ హెచ్చరించారు.
सुबह-सुबह पंजाब पुलिस द्वार पर पधारी है।एक समय, मेरे द्वारा ही पार्टी में शामिल कराए गए @BhagwantMann को आगाह कर रहा हूँ कि तुम, दिल्ली में बैठे जिस आदमी को, पंजाब के लोगों की दी हुई ताक़त से खेलने दे रहे हो वो एक दिन तुम्हें व पंजाब को भी धोखा देगा।देश मेरी चेतावनी याद रखे🙏🇮🇳 pic.twitter.com/yDymGxL1gi
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) April 20, 2022
కౌంటర్ ఇచ్చిన ఆప్ నేత నరేశ్ బాల్యాన్
ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలకు ఆప్ నేత సురేశ్ బాల్యాన్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎందుకు భయపడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు మీరు ఏ వ్యాఖ్యలైతే చేశారో.. వాటికి ఆధారాలు అడగడానికి వ్చారంతే. వారికి ఆధారాలివ్వండి. ఇక్కడితో కథ ముగుస్తుంది అంటూ నరేశ్ బాల్యాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
काँप काहे रहे हो? जो बोला था चुनाव से पहले आपने उसी का तो सबूत माँगने पहुँची है पंजाब पुलिस, दे दो । बात ख़त्म। ऐसे कैसे चलेगा? मै पंजाब जीत की ख़ुशी में मिठाई खिलाने पहुँचा तो भी आप नही खाये। फ़िलहाल आप पंजाब पुलिस की चेतावनी याद रखो @DrKumarVishwas ! pic.twitter.com/CdbTre5cLU
— MLA Naresh Balyan (@AAPNareshBalyan) April 20, 2022
కాంగ్రెస్ నేత అల్కా లంబా ఇంటికి పోలీసులు…
ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లే, కాంగ్రెస్ నేత అల్కాలాంబా ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. ఆమె స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలు ఆప్కు పోలీసులు ఎందుకు అవసరమో ఇప్పుడు తెలిసొచ్చిందని, బీజేపీ లాగే ప్రత్యర్థులను భయపెట్టడానికి పోలీసులను వాడుకుంటున్నారని అల్కా లాంబా ఫైర్ అయ్యారు. అయితే.. పంజాబ్ పోలీసులు అల్కా లంబా ఇంటికి ఎందుకు వచ్చారన్నది స్పష్టంగా తెలియరాలేదు.