కొత్తగూడెం క్రైం: ఆంధ్రా ఏజెన్సీలో ఆదివాసీని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చేరువుగుంపు గ్రామానికి చెందిన మడివి రాజ్ కుమార్ అనే వ్యక్తిని మావోయిస్టులు బంధించారు.
అనంతరం మేటా గ్రామంలో మావోయిస్టులు బుధవారం మధ్యాహ్నం ప్రజాకోర్టు నిర్వహించి రాజ్ కుమార్ ని హత్య చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. అయితే రాజ్ కుమార్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.