సారంగాపూర్, ఆక్టోబర్ 3 : యాద్రాద్రి తరహా లోనే అడెల్లి పోచమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని.. తమిళనాడు, తిరుపతి నుంచి కృష్ణశిలలను తెప్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయంలో రూ.10 కోట్లు, జామ్లో రూ.10 లక్షలతో చేపట్టనున్న పట్టాభిరామాల యం పునః నిర్మాణ పనులు, మండల కేంద్రంలో రూ.35 లక్షలతో నిర్మించనున్న కౌట్ల(బీ) సహ కార సంఘం భవన నిర్మాణ పనులకు మంత్రి శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ దేవాలయాలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధా న్యత ఇస్తున్నారని, మా కుల, ఇంటి దైవం అడెల్లి పోచమ్మేనని తెలిపారు. చిన్న నాటి రోజుల్లో ఎడ్లబండ్లపై వచ్చి అమ్మ వారిని దర్శించుకునే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. జాతర సందర్భంగా వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. మొదటి విడు తగా రూ. 6.60 కోట్లతో కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం, రూ.60 లక్షలతో ఫ్ల్లోరింగ్, రూ. 40 లక్షలతో వసతి గృహాలు, రూ. 40 లక్షలతో కోనే రు ఆధునీకరణ, రూ. కోటితో వంద దుకాణాలు, రూ. కోటితో రాజగోపురం పనులు చేపడుతు న్నట్లు తెలిపారు. అనంతరం జామ్లో బతుకమ్మ చీరలను అందజేశారు.
ఇందులో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘు నందన్రావు, అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రైతుబంధు జిల్లా సమితి కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవ రావు, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అశ్రితరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐరా నారాయ ణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్లు సుచరిత, సుజాత, నాయకులు రాజ్ మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, దేవిశంకర్, భూమే శ్, కండెల భోజన్న, రాజేశ్వర్రావు, ముద్రం దినేశ్, నర్సారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
వైద్యరంగానికి సర్కారు పెద్దపీట
నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 3 : వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ ప్రధాన దవాఖాన స్థాయి పెంపునకు రూ.10 కోట్ల, 30 లక్షలు నిధులు మంజూరు కాగా వాటిని సంబం ధించిన పనులకు సోమవారం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరైందని, కళాశాలకు 430 బెడ్లు అవసరం ఉందన్నారు.
దవాఖానలో అధునాతన సౌకర్యాల తో 50 బెడ్ల నిర్మాణానికి పనులు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలందుతున్నాయన్నారు. జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, సూపరింటెండెంట్ దేవేంద ర్రెడ్డి, డీఎంహెచ్వో ధన్రాజ్, జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఈఈ చంద్ర శేఖర్, ఆర్ఎంవో వేణుగోపాలకృష్ణ, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.