బోథ్, జూలై 6 : బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్తో పాటు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి, వినతి పత్రం అందజేశారు. అలాగే ఇచ్చోడలో షాదిఖాన, నార్నూర్ మండలంలోని కొత్తపల్లిలో సేవాలాల్ ఆలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మంత్రి కేటీఆర్ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించారు. నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.