ఆదిలాబాద్ రూరల్, జూలై 4 : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పట్టణంలోని రిమ్స్లో రోగులు, వారి సహాయకులకు అల్పాహారం వితరణ చేశారు. కేక్ కట్ చేశారు. అనంతరం మియావాకీ పార్కులో మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న కేక్ కట్ చేశారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలు నోట్బుక్లు, పెన్నులు, స్కూల్బ్యాగులు అందజేశారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు
ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, వివిధ ఉద్యోగ వర్గాలు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పాటలు ఆకట్టుకున్నాయి.
రక్తదానం…
తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న ఏటా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేయాలని పిలుపునిస్తుంటారు. ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 475 యూనిట్ల రక్తం బ్లడ్బ్యాంక్కు చేరింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతీవెంకట్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీపీ సెవ్వలక్ష్మీజగదీశ్, నాయకులు జోగు మహేందర్, యూనిస్ అక్బానీ, నల్లా రాజేశ్వర్, శ్రీకాంత్, కౌన్సిలర్లు జాదవ్ పవన్నాయక్, చంద నర్సింగ్, రాజు, గంగారెడ్డి, దేవన్న పాల్గొన్నారు.