తానూర్, జూన్ 27 : సాధారణంగా ‘అడ్మిష న్స్ ఆర్ క్లోజ్డ్’ అనే బోర్డులు మనం ప్రైవేట్ విద్యాసంస్థల్లో చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితి ప్రస్తు తం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్తే ‘పాఠశాలలో ప్రవేశాలు పూర్తి కాబడినవి’ అనే నోటీస్ కనిపిస్తున్నది.
ఈ పాఠశాలలో 6వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో 49 మంది, 7వ తరగతి తెలుగు మీడియంలో 47, ఇంగ్లిష్ మీడియంలో 52, 8వ తరగతి తెలు గు మీడియంలో 46, ఇంగ్లిష్ మీడియంలో 49, 9వ తరగతి తెలుగు మీడియంలో 38, ఇంగ్లిష్ మీడియంలో 45, 10వ తరగతి తెలుగు మీడియంలో 51, ఇంగ్లిష్ మీడియంలో 54 మంది చొప్పున ప్రవేశాలు పొందారు. ఇది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ. దీంతో తరగతి గదుల్లో స్థలం సరిపోవడం లేదు. ఇంకా ప్రవేశాల కోసం విద్యార్థులు వస్తుండడంతో చివరికి ‘పాఠశాలలో ప్రవేశాలు పూర్తి కాబడినవి’ అనే బ్యానర్ను ఏర్పాటు చేసిన ట్లు హెచ్ఎం పసుల గంగాధర్ తెలిపారు.