కామారెడ్డి : టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగాజిల్లా కేంద్రానికి చెందిన వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి విప్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భాను ప్రసాద్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మాజిద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం