భీమ్గల్: భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్, సికింద్రాపూర్, గోనుగోపుల గ్రామాల్లో గురువారం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంపీడీవో రాజేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు సంజీవ్, గంగాధర్, అనసూయ, ఈసీ ప్రశాంత్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.