పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. సినీ తారలు ఈ ప్రకృతి హిత కార్యక్రమంలో భాగమవుతున్నారు. నటి సుభ శ్రీ రాయగురు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ప్రకృతి మనకు ఎంతో మేలు చేస్తున్నదని, అలాంటి ప్రకృతిని కాపాడుకునేందుకు మనం మొక్కలు నాటాలని సుభ అన్నది. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని ఆమె కోరింది.