మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 12 : పాలమూరులో హీరోయిన్ కృతిశెట్టి సం దడి చేసింది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె హాజరుకావడంతో పాలమూరు జనసందోహం అయింది. దీంతో మున్సిపల్ కార్యాలయం నుంచి, క్లాక్టవర్ వరకు ట్రాఫి క్ జామ్ అయింది. జనాలను కంట్రోల్ చేయడానికి ప్రైవేట్ బౌన్సర్లు, పోలీసులు నానా తంటాలు పడ్డారు. షాప్ ఓపెనింగ్ అనంతరం అభిమానులను ఎట్ల ఉన్నారు.. అం టూ పలకరించారు.
సెల్ఫోన్లలో ఫొటోలు తీయడానికి ఉత్సాహం కనబర్చారు. అం తకు ముందు షాపింగ్ మాల్ను పార్లమెంట్ సభ్యుడు, గ్రీన్ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారె డ్డి, మర్రిజనార్దన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. బంగారు ఆభరణాల షోరూంను కూడా ప్రారంభించి సందర్శించారు. ఈ సందర్భంగా షోరూం యజమాని ఎమ్మెల్యే మర్రిజనార్దన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జబర్దస్త్ కమెడియన్లు బుల్లెట్ భాస్కర్, సుధాకర్ టీం కామెడి షోతో అదరగొట్టారు.