లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా తాజాగా మొదటి సారిగా ఈ అంశంపై స్పందించారు.
”అందరం కలిసి వుందాం. హనుమాన్ చాలీసా, లౌడ్ స్పీకర్లపై జరుగుతున్న వివాదం నన్నెంతో బాధించింది. ఈ సందర్భంగా కరోనా కాలాన్ని ఓ సారి గుర్తు చేసుకున్నారు. ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, కొట్లాడుకోవడం చూస్తుంటే బాధగా వుంది. గత యేడాదే అందరమూ కలిసి కట్టుగా కరోనా వైరస్పై పోరాడాం. రాజకీయ పక్షాలు కూడా భుజం భుజం కలిపి కరోనాపై యుద్ధం చేశాయి. ఆక్సిజన్ల కొరత ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో ఎవ్వరు కూడా మతం, కులం అంటూ మాట్లాడలేదు. కరోనా దేశమంతటినీ ఏకతాటిపైకి నడిపింది. మన బంధాలు మతానికి అతీతంగా ఉన్నాయి” అంటూ సోనూసూద్ పేర్కొన్నాయి.
అద్భుతమైన భారతాన్ని నిర్మించడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సోనూసూద్ రాజకీయ నేతలకు సూచించారు. మతం అన్న గోడను బద్దలు కొట్టాలని, మానవత్వం ఆధారగానే ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకోవాలని సోనూసూద్ రాజకీయ నేతలను అభ్యర్థించారు.